సాయంత్రం ఆఫీసుకు రాగానే మా ఇన్ చార్జ్ వేణుగోపాల్ గారు కరోనా వైరస్ బారినపడి సకాలంలో మంచి చికిత్స పొంది క్షేమంగా వచ్చిన ఒక జర్నలిస్టు మిత్రుడి స్వీయానుభవం గురించిన కథనం పంపారు. చూడగానే దాన్ని అందరికీ తెలుపాలనే ఉద్దేశంతో నా ఫేస్ బుక్లో పోస్ట్ చేశాను. మా స్వీయానుభవం కూడా దానికి జతకలిపాను. ఇప్పుడు ఇక్కడ నా బ్లాగులో కూడా దాన్ని పోస్ట్ చేస్తున్నాను.
కరోనా విషయంలో భయాందోళనలు వద్దని, అంటరానితనాన్ని ఆధునిక రూపంలో పాటించవద్దని సూచిస్తున్న ఈ టపా ఎంతమందిని కదిలిస్తోందో నా ఫేస్ బుక్ పోస్టుకు వస్తున్న సందేశాలు, లైక్లే రుజువు. మంచి విషయాన్ని పంచుకుంటున్న మిత్రులందరికీ ధన్యవాదాలు.
కరోనా వ్యాధి చికిత్సకు సంబంధించిన అమూల్యమైన విషయాన్ని తెలిపినందుకు జర్నలిస్టు మిత్రుడు రమణకుమార్ గారికి అభినందనలు..
..........................
కరోనాకు భయపడకండి... ప్రైవేట్ ఆసుపత్రులకు లక్షలు తగలెయ్యకండి..
కరోనా వ్యాధికి
చికిత్సపై.. సీనియర్ జర్నలిస్టు రమణకుమార్ గారి స్వీయ అనుభవం..
Dear friends:
కరోనాకు
భయపడకండి.
కరోనా వచ్చింది
అనగానే వారిని అంటరాని వారిగానో, ఎదో తప్పు చేసినా
వారిగా చూడకండి. ఇది ఒక మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో అన్ని రకాల
వారికి వస్తుంది. కరోనా వచ్చిన వారు first ధైర్యంగా ఉండాలి.
నేను వృత్తి
రీత్యా జర్నలిస్టును. 24 సంవత్సరాలుగా
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్నాను. నా వృత్తి ధర్మంలో భాగంగా నేను విధులు నిర్వహించడానికి
వెళ్ళినప్పుడు మరో మీడియా మిత్రుని ద్వారా నాకు కరోనా సోకింది. నాకు positive వచ్చింది అని తెలియగానే ముందు నేను కొంత ఆందోళన పడ్డాను. వెంటనే మా
కుటుంబ సభ్యులకు టెస్ట్ చేయించడంతో వారికి కూడా positive అని తేలింది.
ఆందోళన నుంచి
తేరుకొని నా మిత్రులు, శ్రేయోభిలాషులు సూచన మేరకు వెంటనే
మా కుటుంబ సభ్యులు అందరం నేచర్ క్యూర్ హాస్పిటల్ లో చేరాము. హాస్పిటల్లో వైద్యులు
ఇచ్చిన మెడిసిన్స్, అక్కడి వాతావరణం మమ్మల్ని వారం
రోజుల్లోనే సాధారణ వ్యక్తులుగా మార్చింది.
మాకు ఇచ్చిన
మెడిసిన్స్
* ప్యారసిటమాల్-500mg టాబ్లెట్స్,
* B-Complex,
* C Vitamin Tablets,
* Citrizen Tab,
* Ambroxel syrup (దగ్గు ఉన్న
వారికి మాత్రమే.)
నాకు కానీ, నా మిస్సెస్ కు కానీ పెద్దగా సింటెమ్స్ ఏమి లేవు. టెస్ట్ positive వచ్చిన తర్వాత రెండవ రోజు నుంచి మా ఇద్దరికీ కొంచం పొడి దగ్గు
ప్రారంభం అయింది. జ్వరం ఉండేది కాదు కానీ, బాడీ feverish గా ఉండేది.
డాక్టర్ల సూచన మేరకు మధ్యాహ్నం, రాత్రి భోజనం
తర్వాత రోజుకు రెండు సార్లు paracitamal ట్యాబ్లేట్లు మూడు రోజులు వాడాము. పొడి దగ్గు ఉంది కాబట్టి దగ్గు
సిరప్ ను ఉదయం 5ml, రాత్రి 5ml మూడురోజులు పాటు వాడాము. రోజుకు ఒకటి B- complex
tablet, ఒకటి C-Vitamin
tablet మధ్యాహ్నం భోజనం తర్వాత వారం రోజుల
పాటు వేసుకున్నాము.
ఈ మెడిసిన్ తో
పాటు మేము పాటించిన నియమాలు ఏమిటి అంటే. తప్పనిసరిగా వేడి నీళ్లు తాగడం. రోజు ఉదయం, సాయంత్రం వేడి నీళ్లలో జండుబామ్ కానీ, పసుపు కానీ వేసుకొని ఆవిరి పట్టడం. రోజుకు మూడు సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేడి నీళ్లలో నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని తాగడం. రోజుకు నాలుగైదు సార్లు వేడి నీళ్లు గొంతులో
పోసుకొని garlic చేయడం
(ఉక్కిలించడం). రాత్రి భోజనం అనంతరం పడుకునే ముందు సగం గ్లాసు పాలల్లో కొంచం పసుపు, నాలుగు మిరియాలు దంచి పొడి చేసుకొని పాలల్లో కలిపి తాగడం.
''వీటన్నిటినీ మేము వారం రోజుల పాటు
క్రమం తప్పకుండా పాటించడంతో వారం రోజుల్లోనే మేము సాధారణం స్ధితికి
వచ్చేశాము."
వీటికి తోడు మంచి
ప్రొటీన్ ఫుడ్, రోజుకు రెండు మధ్యాహ్నం, రాత్రి భోజనంతో ఉడకబెట్టిన కోడిగుడ్డు తినాలి. C-vitamin ఉన్న ఫ్రూట్స్ ఆపిల్, బత్తాయి, orenge వంటి పండ్లు
ఎక్కువగా తినాలి, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తింటే
కరోనా వచ్చిన వారు వారం రోజుల్లో సాధారణ స్థితికి వచేస్తారు. కరోనా వైరస్ ఒక
వ్యక్తి శరీరంలో నుంచి మరో వ్యక్తికి వ్యాపించే సమయం 7 రోజులు మాత్రమే నని, 7 రోజుల తర్వాత వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే శక్తి
కోల్పోతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఒక మనిషి శరీరంలోకి చేరిన కరోనా వైరస్ 10 నుంచి 12 రోజులకంటే
ఎక్కువగా జీవించి ఉండదని, మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ తీసుకుంటే 7 నుంచి 10 రోజుల్లోనే
కరోనాను జయించిన వారు ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు.
నేచర్ క్యూర్
హాస్పిటల్లో...
మేము ఉదయమే
హాస్పిటల్కు వెళ్ళాము. ఎంట్రెన్స్ లోనే
టిఫిన్, వాటర్ బాటిల్స్, మాకు అవసరమైన సామాగ్రి ఇచ్చారు. మేము రూమ్ లోకి వెళ్లిన ఒక గంట
తర్వాత డాక్టర్ వచ్చి మా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు.
మధ్యాహ్నం 1:30 గంటలకు లంచ్, సాయంత్రం 4:30 గంటలకు హెర్బల్
టీ, సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య మళ్లీ డాక్టర్స్ విజిట్.
రాత్రి 8:00 గంటలకు భోజనం.
ఇక్కడ హాస్పిటల్ లో సౌకర్యాలు, వైద్యులు, ఇతర అన్ని రకాల సిబ్బంది సేవలు అభినందనీయం. మరీ ముఖ్యంగా నేచర్ క్యూర్ హాస్పిటల్లో వాతావరణం ఇక్కడికి వచ్చిన వారి రుగ్మతను
సగం తగ్గిస్తుంది. ప్రతి రోజూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్.
ఉదయం, సాయంత్రం డాక్టర్స్ విజిట్. ప్రతి
రోజు ఉదయం, సాయంత్రం హెర్బల్ టీ.
ఇక్కడి వైద్యులు
ఇచ్చే సూచన మేరకు మెడిసిన్స్ వాడడం, తప్పని సరిగా తాగే నీళ్లు వేడి నీళ్లు తాగడం, ఉదయం, సాయంత్రం వాకింగ్ కానీ, యోగ కానీ చేస్తే ఇక్కడికి వచ్చిన వారు నాలుగు, ఐదు రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చేస్తారు. నేచర్ క్యూర్
హాస్పిటల్లో ఉదయం, సాయంత్రం ఇచ్చే హెర్బల్ టీ లో వేసే
పొడి..."మిరియాలు, దాచిన్ చెక్క, సొంటి, ధనియాలతో " చేసిన powder ను వేడినీళ్లలో వేసి టీ-లాగా మగ్గబెట్టి అందులో కొంచం బెల్లం వేసి
ఉదయం ఒక టీ కప్పు, సాయంత్రం ఒక టీ కప్పు ఇస్తారు. ఈ నాలుగు
కలిపి దంచి తయారు చేసిన పొడిని ఒక టీ కప్పుకు సగం చెంచా చొప్పున వేసుకోవాలి.
నిజంగా నేచర్
క్యూర్ హాస్పిటల్ వైద్యుల, సిబ్బంది సేవలు అభినందనీయం.
కరోనా వచ్చింది
అనగానే చుట్టు పక్కల వారు వారిని చూసి ఎదో మాయ రోగం వచ్చింది అన్నట్టుగా చూడడం
మానేయండి. వారిలో ముందు ఆత్మస్థైర్యాన్ని నింపండి. వారికి మానసిక ధైర్యాన్ని
ఇవ్వండి. గుండె జబ్బు, కిడ్నీ,శ్వాసకోశ వ్యాధులు లేని వారు కరోనా గురించి అస్సలు చింతించకండి.
ఇవి ఉన్నవారు డాక్టర్ల సూచనతో చికిత్స పొందండి. ఏమీ కాదు.
కరోనా కూడా ఇతర
వ్యాధుల లాంటిదే. మలేరియా, టైఫాడ్ వంటిదే. ఎవరూ వర్రీ కావద్దు.
కాక పోతే జాగ్రత్తలు మాత్రం తప్పని సరిగా పాటించండి. ఈ వైరస్ మనిషి శరీరంలో గరిష్టంగా 14 రోజులకు మించి
ఉండదని, ఆ తర్వాత అది నశించిపోతుంది
డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి 15 రోజుల పాటు హోమ్ క్వారెంటైన్ కానీ, హాస్పిటల్ క్వారెంటైన్ కానీ పాటించాలి. ఈ 14 రోజుల్లో మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచుకునే ఫుడ్ తీసుకుంటే కరోనా ఖతం అయిపోతుంది. కరోనా
కష్టకాలంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివి.
- ఎ. రమణ కుమార్, సీనియర్ జర్నలిస్ట్.
గమనిక.. ఇది
నాచుర్ క్యూర్ ఆసుపత్రి ప్రమోషన్ కోసం రాసినది కాదు. ఆ ఆసుపత్రిలో చేరిన తర్వాత
వారి స్వీయానుభవం ఇది. ఏ ఆసుపత్రికి వెళ్లనవసరం లేకుండానే పైన చెప్పిన మందులు, ఆహారం తీసుకుంటే చాలు అని చెబుతున్న ప్రాక్టికల్ అనుభవం ఇది. ఆ
రకంగానే దీన్ని చూడగలరు.
.................
ఇది మా
స్వీయానుభవం
మా శోభకు జ్వరం, బాడీపెయిన్స్ వచ్చినప్పుడు ఏ డాక్టర్ వద్దకు పోకుండా సరిగ్గా పైన చెప్పిన మాత్రలే
వాడాము. (ఎందుకైనా మంచిదని చింతలబస్తీలో ఉన్న మా ఇంటికి దగ్గరలో ఉన్న కమ్యూనిటీ
సెంటర్కు వెళితే.. 'రక్తపరీక్షలు వద్దు. పాడూ వద్దు.
వాతావరణం మారింది. వర్షం పడుతోంది కాబట్టి ప్రతి ఒక్కరికీ కామన్గా జలుబు, జ్వరం, దగ్గు వస్తున్నాయి. అస్సలు
భయపడవద్దు. పరీక్షలు ఏవీ వద్దు' అంటూ వారి వద్ద
ఉన్న ప్యారాసెటిమల్ మాత్రలే ఇచ్చి వేసుకోమని చెప్పి పంపారు.) తర్వాత రెండు మూడు రోజులకే ఆమెకు నయమైపోయింది.
గత 3 నెలలుగా కంటిన్యూగా హైదరాబాద్ లోని సాక్షి పత్రికాఫీసులో పనిచేస్తూ వచ్చిన నాకు కూడా ఆ సమయంలోనే నలతగా అనిపిస్తే అవే మాత్రలు వాడాను. ఆశ్చర్యకరంగా నాకూ రెండు మూడురోజులకే
జ్వరం తగ్గిపోయింది. ఇంతమాత్రానికి ప్రైవేట్ ఆసుపత్రులు లక్షల రూపాయలు పరీక్షల
పేరిట పీల్చేస్తున్నాయి. 3 నెలలపాటు రోగులు లేక రాబడి రాక
విలవిల్లాడిపోయినట్లుంది కదా అందుకే పొరపాటున కరోనా చికిత్స కోసం రోగులు వస్తే చాలు జలగల కంటే
ఘోరంగా రక్తం పీల్చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్లో ఒక కార్పొరేట్ ఆసుపత్రి జలగలు కరోనా
చికిత్స పేరట ఏడున్నర లక్షల రూపాయల బిల్లు వేశారట. వార్త కూడా వచ్చింది. పాపం. ఆ
చికిత్స చేయించుకున్న పెద్దమనిషి ప్రాణం అలాగే పోయి ఉంటుంది ఆ బిల్లు చూడగానే.
(మా ఇద్దరికీ సీజనల్ జ్వరం రావడానికి
కారణం మూడు వారాల క్రితం హైదరాబాదులో కురిసిన తొలి వర్షంలో తడుస్తూ రాత్రిపూట సాక్షి ఆఫీసు నుంచి నడుస్తూ ఇంటికి చేరడమే.
తొలి వానల్లో తడిస్తే ప్రమాదం అని తెలిసీ.. ఇల్లుదగ్గరే కదా త్వరగా వెళ్లిపోవచ్చులే
అని నడుచుకుంటూ వెళ్లాం. అంతే.. కొట్టేసింది. ఆ మాత్రం దానికి ఆమె ఆఫీసు వారి
సలహాతో స్వచ్చందంగా రెండు వారాలు హోం క్వారంటైన్లో ఉండిపోయింది. (రిస్కు వద్దని, ఎవరూ ఇబ్బంది పడవద్దని, ఇబ్బంది పెట్టవద్దని మా ఆఫీసు వారి సలహా.) అయితే కరోనా ఏదీ
సోకకున్నప్పటికీ, పాజిటివ్ అని తేలకపోయినప్పటికీ
ముందు జాగ్రత్త పేరిట హోం క్వారంటైన్లో ఉన్న ఏకైక విచిత్రపు కేసు మా శోభదే
కాబోలు).
మిత్రులు రమణ్
కుమార్ గారు పైన చెప్పిన మాత్రలు సులువుగా దొరుకుతాయి. ఏ చిన్న మెడికల్ షాపుకి
వెళ్లి అడిగినా ఇస్తారు. మేము వాడిందే ఇవి మరి. పైగా డాక్టర్ సమరం గారు ముప్పై
ఏళ్ల క్రితమే చెప్పినట్లు తిండి విషయంలో
రాజీపడకుండా మూడు పూటలా కడుపునిండా తిండి తింటే ఏ రోగమూ దరి చేరదు. భారతదేశంలో
నూటికి 75 శాతంపైగా రోగాలు
ఆహార లేమితోనే వస్తున్నాయని డాక్టర్ సమరం అప్పట్లోనే చెప్పారు. అందుకే కదా యాత్ర
సినిమాలో వైఎస్సార్ పాత్రధారి గొప్ప డైలాగు చెబుతారు. 'అన్నిటికంటే పెద్ద జబ్బు పేదరికమేనయ్యా' అని..
డయాబెటిక్, బీపీ ఉన్న నేను ఏమాత్రం భయపడకుండా హైదరాబాద్లోని సాక్షి ఆఫీసుకు
ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా గత 3 నెలలుగా (ఆదివారం మినహా) నిత్యం పని చేస్తూనే వచ్చాను. (మూడు వారాల క్రితం ఆమెతోపాటు నాకు కూడా జ్వరం, జలుబు చేసిన ఆ నాలుగురోజులు ఇంటి వద్దే ఉండి పని చేశాను. వర్క్ ఫ్రమ్ హోమ్.) అన్ని పత్రికాఫీసులు, టీవీ మీడియంలో మాదిరే మా ఆఫీసులోకూడా లాక్ డౌన్ ప్రకటించిన
రెండున్నర నెలల తర్వాత ఒకరిద్దరికి కరోనా పాజిటివ్ సోకింది. వారు క్వారంటైన్
అయ్యారు. కొంతమంది ఇంటినుంచే పని చేస్తున్నారు. మాలాంటి వాళ్లం రెగ్యులర్గా ఆఫీసుకు
వస్తూనే ఉన్నాం. మాకేమీ కాలేదు.
కానీ ఇదిగో పులి
అంటే అదిగో తోక అన్న చందాన కరోనా పాజిటివ్ అని తెలిస్తే చాలు.. అంటరానితనాన్ని
ఆధునిక రూపంలో పాటిస్తూ పారిపోతున్న, అతి జాగ్రత్తల పేరుతో హైరానా పడుతున్న వారిని చూస్తే "ప్రభూ
వీళ్లేం చేస్తున్నారో వీరికి తెలియదు క్షమించుడి" అనే ఆ ప్రఖ్యాత స్తోత్రవచనం
మళ్లీమళ్లీ గుర్తుకొస్తూ ఉంటుంది.
Nature Cure Hospital
Alternative medicine clinic in
Hyderabad, Telangana
Address: MMTS Station, Begumpet, Hyderabad,
Telangana 500017
Phone: 040 2373 1786
4 comments:
మీ post చదివాను. ప్రస్తుత పరిస్థితిలో మీ post చాలా మందికి, నాకు ధైర్యం ఇచ్చింది. ధన్యవాదాలు
థాంక్యూ కరీమ్ ఖాన్ గారూ.. సకాలంలో ఈ కథనం నాకు అంది మీ వంటి వారందరికీ అందించగలిగినందుకు నాకూ సంతోషంగానే ఉంది. ధన్యవాదాలు.
Is this Nature Cure Hospital, Hyderabad notified in the list of Telangana Govt. Authorised Hospitals for COVID19 treatment under Govt. and/or Pvt. Categories ? Pl confirm
If you can share the contact no. of - ఎ. రమణ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ it will be if immense help to all, at the earliest
నాని గారూ, క్షమించాలి. చాలా ఆలస్యంగా మీ వ్యాఖ్య చూస్తున్నందుకు. నేచుర్ క్యూర్ ఆసుపత్రి తెలంగాణ ప్రభుత్వం అధీకారికంగా ప్రకటించిన ఆసుపత్రే నండీ. ఈ విషయంలో ఢోకానే లేదు. ఈ టపాకు మూలమైన రమణ కుమార్ గారి ఫోన్ నంబర్ నాకు కూడా తెలీదండీ. మీరు అడిగాక ఇప్పడే వాకబు చేశాను. ఈ టపా నాకు పంపిన వారికి కూడా తెలీదట. వీలయితే కనుక్కుని అందరికీ మరో టపా ద్వారా ఇస్తాను. ధన్యవాదాలు.
Post a Comment