Pages

Sunday, July 26, 2015

బాహుబలి కత్తితో తెలుగు దర్శకుల తలలు నరికిన రాజమౌళి


తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందరు తలలను బాహుబలి కత్తితో నరికాడు రాజమౌళి అంటూ రాం గోపాల్ వర్మ మరోసారి పూనకం పట్టి అరిచేశాడు. వాస్తవానికి బాహుబలి సినిమాను ప్రీమియర్ షో చూసిన తర్వాతే బాంబే చిత్రపరిశ్రమ మూగపోయింది. ఆ సినిమా చూసిన తర్వాతే తమిళ చిత్ర పరిశ్రమ నివ్వెరపోయింది. లక్ష లోపాలున్నాయని విమర్శకులు మొత్తుకుంటున్నా సరే బాహుబలి ప్రభావం హాలీవుడ్ వరకు విస్తరించిపోయింది. భాషా భేదాలు లేకుండా సినిమాను చూస్తున్న జనం బాహుబలికి అది విడుదలైన 15 రోజుల తర్వాత కూడా దాసోహమవుతున్నారు. ఆ దాసోహం విలువ డబ్బు రూపంలో నేటికి 402 కోట్లు.

కానీ ఆశ్చర్యం ఏమంటే రాంగోపాల్ వర్మ ఇంతవరకు ఆ సినిమాను చూడలేదు. కానీ ప్రపంచం మొత్తాన్ని ఎదురుగా పెట్టుకుని రాజమౌళిని తొలి రోజునుంచి ఆకాశానికి ఎత్తిన రామూ.. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్లు, దర్శకులందరి తలల్నీ రాజమౌళి నరకడమే కాకుండా మీ స్టామినా ఏదో ఇప్పుడు నాకు చూపండి అంటూ సవాలు విసిరాడని మరోసారి ఢంకా భజాయించాడు.

సాక్షి మేనేజింగ్ ఎడిటర్ స్వప్న నేతృత్వంలో రూపొందుతున్న రాముఇజం ప్రసార కార్యక్రమంలో ఒక గంటపాటు మళ్లీ బాహుబలి ప్రభావం గురించి ప్రచారం చేసాడు (జూలై 19న.). ఒక సినిమాను ఇంతవరకూ చూడకుండానే ఇంత స్థాయిలో బ్రాండ్ అంబాసిడర్ అవతారమెత్తిన రామూకు.. బాహుబలి టిక్కెట్లు ఇస్తున్నాం పోయి చూసి రండి అంటూ ఇంటర్వ్యూ చివరలో సాగనంపారు స్వప్న.

రామూ ఎందుకు తెలుగు సినీ దర్శకులను ఇంతగా తీసిపారేస్తున్నాడో, దమ్ముంటే బాహుబలిని మించిన సినిమాను తీయండి చూద్దాం అంటూ ఎందుకిలా పదే పదే సవాలు చేస్తున్నాడో తెలుసుకోవాలంటే జూలై 19న స్వప్నకు తను ఇచ్చిన ఇంటర్వ్యూను కింది లింకులో చూడండి.

ఇది మీ ఓపికకు సంబంధించిన సమస్య. నాకయితే తన మాటల్లో పూర్తి నిజాయితీ ఉందనిపించింది. మీరు ఏకీభవించవచ్చు లేదా ఏకీభవించకపోవచ్చు కానీ ఆసక్తి ఉంటే రామూ బాధను ఒకసారి వినండి. కాదు.. చూడండి.

RGV Talks about Baahubali Movie Episode 33
https://www.youtube.com/watch?v=XdPQK4EqP3I

1 comments:

Anonymous said...

madcap

Post a Comment