Pages

Monday, March 21, 2016

‘జాతీయవాదులకు’ మంచి రోజులు వచ్చేశాయట...!

మహత్తరమైన మన భారత జాతీయవాదులు, మరో దేశానికి వ్యతిరేకంగా కాదు, తమ సొంత ప్రజలకు వ్యతిరేకంగానే ఆగ్రహావేశాలను రేకెత్తిస్తున్నారు. మన కపట జాతీయవాదులు తమ సొంత పౌరుల మతం లేదా భావజాలం గురించి వెంటపడుతున్నారు. వారికి పట్టేది, వారి ఆగ్రహం అంతా అంతర్గత శత్రువు గురించే. అది దేశం మీద ప్రేమ కాదు లేదా  మరే ఇతర ప్రేమా కాదు. అది విద్వేషం, విరోధం. 

భారత ముస్లింలను, భారత దళితులను అణచివేయడం జాతీయవాదం కాదు. ‘జాతి వ్యతిరేకత’ అని మనం అభియోగంగా అతి తేలికగా వాడేసే ఈ పదం నేడు యూరోపియన్ భాషలలో నిజంగా వాడుకలో ఉన్నది కాదు. భారతీయుల వంటి ప్రాచీన కాలపు ప్రజలు మాత్రమే వాడేది. జాతి అనేది ఏ అర్థాన్ని ఇస్తుందో దానికి వ్యతిరేకమైన విషయాలకే అది ప్రాతినిధ్యం వహిస్తోంది. భారత్ మాతా కీ జై అనడం గాక, ఏది నిజమైన జాతీయవాదమో నిర్ణయించేది ఎవరు? నిజంగానే నాకు భారత జాతీయవాదం అంటే ఏమిటో తెలియదు.

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ జాతీయవాదం అంటే ఏమిటనే అంశంపై బహిరంగ ఉపన్యాసాల పరంపరను నిర్వహిస్తోంది. వీడియోల సెట్టుగా అవి అందుబాటులోకి వస్తున్నాయి. అవి విద్వద్వంతమైనవే అయినా సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటాయి. అదో గొప్ప కృషే. కానీ అందులో చాలా భాగం భారతీయుల మీదనే వృథా చేస్తారేమోనని నా భయం.  మీరెంత ఘోరంగా ప్రవర్తించినా ఫర్వాలేదు, భారత్ మాతా కీ జై అని అంటున్నంత కాలం మీరీ దేశంలో జాతీయవాదే.

వార్తా పత్రికల్లోనే వచ్చిన మరో కథనం, ఇద్దరు ముస్లింల గురించినది. వారిలో ఒకరు 15 ఏళ్ల పిల్లాడు. సరిగ్గా అమెరికన్ ఆఫ్రికన్లను అమెరికాలో చేసినట్టే... వాళ్లను కూడా చెట్టుకు కట్టేసి చిత్రహింసల పాలు చేసి చంపారు. వారిద్దరూ గేదెలను మేపుకుంటున్నారు. కాబట్టి వారి నేరం ఏమిటో స్పష్టం కాలేదు. అయితే ఈ విద్వేషాన్ని ఎక్కడి నుంచి రేకెత్తిస్తున్నారనేది మాత్రం పూర్తిగా కచ్చితంగా తెలిసినదే.

ఇదేమైనా ప్రభుత్వం కాస్త ఆగేట్టు చేస్తుందా? ఎంతమాత్రమూ చేయదు. ఇంకా మరింత ‘‘జాతీయవాదం’’ కోసం పిలుపునివ్వడం కోసం ఈ వారాంతంలో బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం కానున్నది. ఇప్పటికే మనకున్నది సరిపోదా?

మన హిందుత్వ జాతీయవాదులు ప్రచారం చేస్తున్నది విభిన్న తరహా జాతీయవాదం. అది, మరో దేశంతో పోలిస్తే మరొక దేశంలోని వారికి తమ పట్ల ఉండే భావం అని చెప్పే యూరోపియన్ జాతీయవాదం కాదు.

సెర్బియన్లను, ఆస్ట్రో-హంగేరియన్లు, వారిని రష్యన్లు, వారిని జర్మన్లు, వారిని ఫ్రెంచ్‌వాళ్లు ద్వేషించటం వల్ల ప్రపంచ యుద్ధం జరిగింది. ఇటాలియన్లు ఆ యుద్ధంలో ఎందుకు చేరారో నాకైతే గుర్తులేదు. కానీ బ్రిటిష్‌వాళ్లు ప్రతి ఒక్కరినీ ద్వేషించేవారనేది మాత్రం నిజం. ఒక్కసారి నిప్పు అంటుకున్నదే చాలు, అంతా ఒకరిపైకి మరొకరు విరుచుకుపడ్డారు.  టర్కులను, అరబ్బులను, భారతీయులను, తత్పర్యవసానంగా అమెరికా వంటి  దేశాలనూ అందులోకి ఈడ్చారు.

రెండు ప్రపంచ యుద్ధాలలో ఆ దేశాలు తమకు తాము చేసుకున్న హాని ఫలితంగా యూరోపియన్ దేశాలు తమ సంకుచితత్వాన్ని కోల్పోయాయి. అదే ఆ తర్వాత వారిలో యూరోపియన్ యూనియన్ పట్ల ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈయూ అంటేనే, తమ తమ జాతీయతలను వదుల్చుకుని, తమ సరిహద్దులను, మార్కెట్లను ఒకరికొకరు తెరుచుకోవాలని కోరుకున్న ప్రజా సముదాయాలు.  కాగా, నేటి భారతదేశంలోని మన ‘జాతీయవాదం’ మరో జాతికి వ్యతిరేకమైనది కాదు, ఇతర భారతీయులకు వ్యతిరేకమైనది. అందుకే ఇది విభిన్నమైనది.

నాగరిక సమాజంలో భారత ప్రతిష్టపై ఇది ఎలాంటి ప్రభావాన్ని కలుగజేస్తుందో బీజేపీ వాళ్లకు తెలియదా? ఏ విదేశీ పేపర్‌ను లేదా పత్రికైనా తీసుకోండి. భారత్ గురించి అందులో ఉండే వార్తలన్నీ ప్రతికూలమైనవే. ఎందుకు? నివారించగలిగిన ఒకే విధమైన ఘటనలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని మనలో చాలా మందిమి, మిగతా ప్రపంచమూ కూడా భావిస్తోంది కాబట్టి. ఈ పరిస్థితుల్లో అవి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నవేమోననే అనుమానం కలగకుండా ఉండటం తేలికేం కాదు.

విద్వేషం నిండిన, కపట జాతీయవాదులకు మంచి రోజులు వచ్చేశాయి.
..................

పై పరిచయ వాక్యాల్లో ఒక్క అక్షరం కూడా నాది కాదు.

ప్రముఖ కాలమిస్టు, రచయిత ఆకార్ పటేల్ 'సాక్షి' పత్రికకు పంపిన కాలమ్ ఇది.

జాతీయవాదులకు, జాతి వ్యతిరేకులకు మధ్య సాగుతున్న మోసపూరితమైన, ఈ సొంత తయారీ చర్చ త్వరలోనే సమసిపోతుందని ఆశపడుతున్న తనలాంటి వాళ్లకు.. 'భారత వ్యతిరేకమైన రాతలేవీ రాయడం లేదని హామీ ఇవ్వాలం'టూ కేంద్ర మానవ వనరుల మంత్రిణి.. ఈ కలియుగంలో సైతం సత్యం మాత్రమే పలికుతూ అసత్యాన్ని తన దరికి కూడా రానివ్వని.. శ్రీమాన్ స్మృతి ఇరానీ నిర్దేశనలోని ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్’ (ఎన్‌యూపీయూఎల్), మార్చి 19న  దేశంలోని ఉర్దూ రచయితలందరినీ నిర్దేశించినట్లు వచ్చిన వార్త నిరుత్సాహం కలిగించిందని ఆకార్ పటేల్ అభిప్రాయపడ్డారు.

తనకు ఇప్పుడు సాగుతున్న ప్రపంచ క్రికెట్ కప్ వంటి విషయాల గురించి రాయాలని ఉంది. కానీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఈ వార్తా కథనం వల్ల... మధ్యయుగాల కాలపు ఈ నిత్య పోరాటంలో తాను కూడా ఏదో ఒక పక్షాన నిలవడం తప్ప, గత్యంతరం లేకపోయిందంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు.

అణువణువునా విద్వేషం నిండిన కపట జాతీయ వాదులకు ప్రస్తుతం మంచిరోజులు వచ్చేశాయన్నది ఆయన ముక్తాయింపు.

అదేదో ఆయన మాటల్లోనే పూర్తిగా కింది లింకులో చదువగలరు.

‘జాతీయవాదులకు’ మంచి రోజులు వచ్చేశాయి
ఆకార్ పటేల్
aakar.patel@icloud.com


గమనిక:
దేశద్రోహ కేసులో అరెస్టయిన జేఎన్ యూ విద్యార్తులు ఉమర్ ఖాలిద్, అనిర్బాన్ మార్చి 18న విడుదలై క్యాంపస్ కు వచ్చిన సందర్భంగా జేఎన్ యూ విద్యార్థినీ విద్యార్థుల ఆనంద హేలను ఈ అత్యద్భుతమైన  వీడియోలో చూడగలరు. దేశంలో ఏ యూనివర్సిటీలోనూ లేనంత అధికంగా (60 శాతం) జేఎన్ యూలో ఉన్న విద్యార్థినులు గళమెత్తితే, ఆజాదీ అంటూ తాండవమాడితే ఎలా ఉంటుందో ఈ తాజా వీడియోలో సుస్పష్టంగా చూడవచ్చు. 

వెనుకబడిన, ఉన్నత వర్గాల విద్యార్థినులు తమ విద్యార్థి నేతల విడుదల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ చేసిన నినాదాల ఆత్మఘోషను వినడానికి మనసు పుడితే కింది వీడియో లింకు తప్పక చూడండి.

Stand With JNU

(Electrified video from Jnu ladies)
https://www.facebook.com/standwithjnu/videos/1280983335249155/

Azadi Azadi Azadi Azadi

Slogans for freedom resonated in JNU as the University community celebrated the return of Umar and Anirban to the campus on 18 March 2016, following the grant of bail by the Patiala House court.

https://www.facebook.com/c.vanaja/posts/10208247434730794?from_close_friend=1
--------------------------

అలాగే ఉమర్ ఖాలిద్, అనర్బన్ విడుదల సందర్భంగా కన్హయ్య నేతృత్వంలో వందలాది విద్యార్థులు ఇస్తున్న నినాదాల హోరును ఇక్కడ చూడవచ్చు.

Azadi slogans at JNU's Freedom Square, led by Kanhaiya

https://www.youtube.com/watch?v=VQc_1a2tXX4

Students chant slogans of Azadi (freedom) at JNU's Freedom Square on 18 March 2016 - the night when Umar and Anirban returned to campus - with Kanhaiya Kumar, the JNUSU President, leading the sloganeering.




2 comments:

manasa said...

కాకులు ఎంత గొంతు చించుకున్న సత్యం మారదు .భారతీయులను తక్కువ అంచనా వేసుకోవద్దు .

Anonymous said...

విశ్వనియత లేని హిందూ వ్యతిరేక వార్తలు వార్తా పత్రికలో చాలా వస్తాయి. వాటిని నిజమైన భారతీయులు పట్టించుకోరు.మతోన్మాది ఆకార్ పటేల్ రాసిన దానిలో నిజమెంత ఉందని ఎవరికి తెలుసు.

ఆకర్ పటేల్ ఈ దేశ అథిది అని మరచిపోయినట్లు ఉన్నాడు. ఆయనకు భారతదేశం నచ్చకపోతే బాబు బాబు నువ్వు ఇక్కడ ఉండి మాదేశాన్ని రక్షించమని బతిమిలాడారా? అథిదు లు కూచున్న ఇంటిన ఇంటినే తగల బెడతాం అంటే ఇండీయా యురోప్ కాదు, భారతీయులు వీడి ఆగడాలు చూస్తూ ఊరుకోరు.

Post a Comment